ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

76చూసినవారు
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం లోకేశ్వరం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గడ్చందా గ్రామానికి చెందిన ఒళ్లేపు ముత్యం (47) గోవింద చెరువు ఆయకట్టు కింద పొలానికి వెళ్లి కాళ్లు, చేతులు కడుక్కోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ కాలు జారి చెరువులో పడి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్