చెట్టులో వెలిసిన దుర్గామాత.. పూజలు చేస్తున్న భక్తులు

78చూసినవారు
భైంసా మండమం వానల్పహాడ్ గ్రామంలోని ఎల్లమ్మ గుట్టపై ఎన్నో సంవత్సరాలుగా ఉన్న చింతవృక్షం కాండంపై విజయ దుర్గామాత స్వయంభూ వెలసినట్లు గ్రామస్థులు తెలిపారు. స్వయంభూ వెలిసిన అమ్మవారిని చూడడానికి గ్రామస్థులు భారీగా తరలివచ్చారు. ఇదివరకు ఎల్లమ్మగుట్టపై ఆదిమానవుల ఆనవాళ్లు లభ్యమైనట్లు చరిత్రకారులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కటకం మురళీ తెలిపారు. దసరా ముందు అమ్మవారు వెలవడం శుభపరిణామంగా భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్