తానుర్ మండలంలోని ఝరి(బి) గ్రామంలో అక్రమంగా దేశీదారు అమ్ముతున్న వ్యక్తిని గురువారం రాత్రి అరెస్టు చేసినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. గ్రామానికి చెందిన అమీర్ రావు కొంతకాలంగా మహారాష్ట్ర నుంచి దేశీదారు తీసుకువచ్చి గ్రామంలో అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. పక్క సమాచారం మేరకు పోలీసులు దుకాణంలో దాడి చేసి 21 దేశీదారు బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఎక్సైజ్ శాఖ అధికారులను అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.