సిసి రోడ్డు పనులను ప్రారంభించిన జెడ్పిటిసి
తలమడుగు మండలం ఆర్లి (కే) గ్రామంలో ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో మంజూరైన రూ. 4 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులను జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి భూమి పూజ చేసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గణేష్ రెడ్డి మాట్లాడుతూ. ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పని చేయాలన్నారు. గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నాయకులపై ఉందన్నారు. MPP కళ్యాణం లక్ష్మి రాజేశ్వర్, ఎంపీటీసీ సుస్మిత, రమేష్ రెడ్డి తదితరులున్నారు.