ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో వరసకు మామ అయ్యే వ్యక్తి కొన్ని నెలలుగా పలుమార్లు అత్యాచారం చేయడంతో టెన్త్ చదువుతున్న 15 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది.పోలీసుల ప్రకారం.. పీరియడ్స్ రావట్లేదని సదరు బాలికను ఆమె కుటుంబం ఆసుపత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. స్నానం చేస్తుండగా వీడియో తీసి, బ్లాక్ మెయిల్ చేసి తనను అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపింది. దీంతో నిందితుడు గణేశ్పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.