కమీషన్ల కోసమే కల్తీ నెయ్యికి ఓకే చెప్పారు: ఎమ్మెల్యే రఘురామ

66చూసినవారు
కమీషన్ల కోసమే కల్తీ నెయ్యికి ఓకే చెప్పారు: ఎమ్మెల్యే రఘురామ
కమీషన్ల కోసం జగన్‌ రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో.. కల్తీ నెయ్యికి ఒకే చెప్పారని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆరోపించారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై రఘురామ మాట్లాడుతూ ‘‘లడ్డూ ప్రసాదంలో కల్తీ నిజమే.. 2019 వరకు శ్రీవారి ప్రసాదం జోలికి పాలకులు వెళ్లలేదు. లడ్డూ ప్రసాదంలో నాణ్యత తగ్గిందని కొంతకాలంగా భక్తులు ఆవేదన చెందుతున్న మాట నిజమే. ఇకపై స్వచ్ఛమైన నెయ్యితో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి సీఎం చంద్రబాబు ఆదేశించారు’’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్