రేపటి నుంచి 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం

54చూసినవారు
రేపటి నుంచి 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం
ఏపీలో రేపటి నుంచి ఆరు రోజుల పాటు కొత్త కార్యక్రమం ప్రారంభం కానుంది. కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన నేపథ్యంలో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఇచ్చాపురం వెళ్లనున్నారు. వంద రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ప్రభుత్వం అమలు చేసిన హామీలను వివరించనున్నారు. రేపటి నుంచి ప్రజాప్రతినిధులు ఆరు రోజుల పాటు ఇంటింటికి తిరిగి వారి పాలన ఎలా ఉందో ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకోనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్