ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో వచ్చే ఏడాది మహా కుంభమేళా జరుగనుంది. ఈ మేళాలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడడానికి AIని ఉపయోగించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా 2025లో జరగబోయే మహా కుంభమేళాపై సమీక్ష నిర్వహించారు. ఈ మెగా ఈవెంట్కు AI టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, భద్రత, రద్దీ, పరిశుభ్రత, సౌకర్యాల పరంగా ఇబ్బందులు రాకుండా చూడడానికి ఏఐ సాధనాలను వాడుకోవాలని చెప్పారు.