ఉత్తరప్రదేశ్ లోని తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అహ్మదాబాద్లోని లలిత్పూర్కు చెందిన నలుగురు వ్యక్తులు తన భర్తను కిడ్నాప్ చేశారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో.. తనకు న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ ఓ మహిళ డీఎం కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడున్న వారు మహిళపై నీళ్లు పోసి ఆపారు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.