భారత ప్రధానిగా మూడోసారి ఎన్నికైన ప్రధాని మోదీ జులైలో రష్యా పర్యటనకు వెళ్లనున్ననట్లు తెలుస్తోంది. భారత్-రష్యా మధ్య వార్షిక చర్చల నిమిత్తం ఈ పర్యటన జరగనుంది. అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్కు చెందిన అధికారి ఒకరు ఈ విషయాన్ని ద్రువీకరించినట్లు రష్యాకు చెందిన ఆర్ఐఏ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మోదీ పర్యటన విషయంలో రష్యా నుంచి బహిరంగ ఆహ్వానం ఉందని, పుతిన్ తో ఆయన సమావేశం ఉంటుందని మార్చి నెలలో క్రెమ్లిన్ వెల్లడించింది.