ఎయిరిండియా సంస్థ కేబిన్ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన కారణంగా ఓ మహిళా ప్రయాణికురాలిని విమానం నుంచి దించేసింది. ‘మార్చి 5న ఢిల్లీ నుంచి లండన్కు వెళుతున్న ఏఐ161 విమానం టేకాఫ్ అవడానికి ముందు ఓ మహిళా ప్రయాణికురాలు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఫైలట్ సూచన మేరకు ఆమెను దించేశాం. హామీపత్రం తీసుకున్న తర్వాత మరో విమానంలో పంపాం’ అని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు.