ప్రాంతీయ భాషలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా ప్రాంతీయ భాషల్లోనే ప్రభుత్వ ఆదేశాలు ఉండాలని ఆకాంక్షించారు. మాతృ, సోదర భాష తర్వాతే మిగిలిన లాంగ్వేజ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అయితే తాను ఇంగ్లీష్కు వ్యతిరేకిని కాదని స్పష్టం చేశారు. మాతృభాషలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, అది చాలా గొప్ప విషయమని కొనియాడారు. యువతలో స్కిల్ పెంచేందుకు శిక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు.