కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్గా రవి అగర్వాల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 1న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, రవి అగర్వాల్ 1988 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. 2023 జులై నుంచి సీబీడీటీ (అడ్మినిస్ట్రేషన్) సభ్యుడిగా ఆయన వ్యవహరిస్తున్నారు.