దేశీయ టెలికం దిగ్గజ ఆపరేటర్ ‘భారతీ ఎయిర్టెల్’ వినియోగదారులకు మరో నూతన ప్లాన్ను ఆవిష్కరించింది. సరికొత్త రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్ను పరిచయం చేసింది. ఈ ప్లాన్ కింద ఆకర్షణీయంగా 45 రోజుల వ్యాలిడిటీని కంపెనీ అందిస్తోంది. మొత్తం 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, మొత్తం 600 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. 2జీబీ కంటే ఎక్కువ డేటా కావాలనుకుంటే రోజుకి రూ.19తో ‘యాడ్ ఆన్ డేటా’ వోచర్లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.