శరద్ పవార్‌తో అజిత్ పవార్ గ్రూప్ ఎమ్మెల్యే భేటీ

53చూసినవారు
శరద్ పవార్‌తో అజిత్ పవార్ గ్రూప్ ఎమ్మెల్యే భేటీ
అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అతుల్ బెంకే శనివారం ముంబైలో ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్‌ను కలిశారు. ఇక అతుల్ బెంకేను 'రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మీరు ఏ ఎన్‌సిపి వర్గంతో ఉంటారు' అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని ఆయన బదులిచ్చారు. అజిత్ పవార్ 2023 జూలైలో ఎన్‌సిపిని విభజించి, మహాయుతి కూటమిలో చేరారు. డిప్యూటీ సీఎం అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్