హైదరాబాద్ చేరుకున్న అఖిలేశ్ యాదవ్ (వీడియో)

7213చూసినవారు
యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్న విషయం తెలిసిందే. దీనికోసం అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో అఖిలేష్ యాదవ్‌కు తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. కాసేపట్లే అఖిలేశ్, కేసీఆర్ భేటీ కానున్నారు.

సంబంధిత పోస్ట్