తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అలెర్ట్ ఐఎండీ జారీ చేసింది. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు వీస్తాయని జాగ్రత్తగా ఉండాలని సూచించింది.