తిరుమల భక్తులకు అలర్ట్

51చూసినవారు
తిరుమల భక్తులకు అలర్ట్
తిరుమల భక్తులకు అలర్ట్. ఈ నెల 18 నుంచి ఆన్ లైన్లో అక్టోబర్ నెల దర్శన టిక్కెట్ల విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు టీటీడీ ఈవో శ్యామలరావు. భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేయనుందని తెలిపారు. రోజు రెండు లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అన్నప్రసాద సముదాయంలో యంత్రాల ఆధునీకీకరణ, ఉద్యోగుల సంఖ్యను పెంచుతామని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్