ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. స్వచ్ఛతకు గల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు.. ఢిల్లీలో అమెజాన్ స్వచ్ఛతా స్టోర్ను ఏర్పాటు చేసింది. దీనిని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించారు. అవసరమైన వస్తువులను సులభంగా కొనుగోలు చేయడంతోపాటు వినియోగదారులకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందిస్తూ వారికి అవగాహన కల్పించడమే ఈ స్టోర్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.