నిన్నరాజస్థాన్తో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓటమిపాలైంది. అయితే ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. అతని కళ్లు చెమ్మగిల్లాయి. విజయం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నా జట్టు గెలవలేకపోయిందనే బాధతో కోహ్లీ కనిపించాడు. డగౌట్లో కూర్చున్న అతడు ఎమోషనల్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో కోహ్లీ 113* పరుగులు చేశాడు.