భావోద్వేగానికి గురైన ప్రధాని మోడీ (వీడియో)

544చూసినవారు
ప్రధాని మోడీ శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించారు. షోలాపూర్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ పథకం కింద పేద ప్రజలకు ఇళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఒక్కింత భావోద్వేగానికి గురయ్యారు. తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ ఇళ్లను చూస్తే తన బాల్యం గుర్తొస్తుందన్నారు. చిన్నప్పుడు నాకు కూడా ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వస్తే ఎలా ఉంటుందోనని ఆలోచించే వాడినని చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్