ఆంద్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో కొలువైన అరగొండ వీరాంజనేయస్వామి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఇక్కడ సంజీవరాయ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన ఈ ఆలయంలోని ఆంజనేయుడు అనారోగ్యాలను నయంచేసే ధన్వంతరిగా భక్తుల పూజలు అందుకుంటాడు. పచ్చని కొండల మధ్య కట్టిన ఆలయంలో ఉత్తర ముఖాన వెలసి.. ఏ పని మొదలుపెట్టినా విజయం చేకూరుతుందని అభయమందిస్తాడని భక్తుల నమ్మకం. ఇక్కడి తీర్థంలోని నీటిని తాగితే అనారోగ్యాలు నయమవుతాయట.