ఇంటర్ చదువుతున్న విద్యార్థిని కళాశాల వాష్రూంలోనే ప్రసవించడం తీవ్ర చర్చనీయాంశమైంది. కర్ణాటక రాష్ట్రం కోలారు నగర శివార్లలోని ఒక ప్రైవేటు కళాశాలలో బాలిక (17) PUC (ఇంటర్మీడియట్) మొదటి సంవత్సరం చదువుతుంది. మంగళవారం తరగతి గదిలో ఉండగా పురుటి నొప్పులు రావడంతో వాష్రూంలోకి వెళ్లి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని కోలారు మహిళా ఠాణా పోలీసులు వెల్లడించారు.