ఇవాళ స్వదేశానికి రానున్న టీమిండియా

65చూసినవారు
ఇవాళ స్వదేశానికి రానున్న టీమిండియా
T20 వరల్డ్‌కప్ విన్నర్ టీమిండియా ఇవాళ రాత్రికి స్వదేశానికి చేరుకోనుంది. ఈరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు కరీబియన్ దీవుల నుంచి బయలుదేరే రోహిత్ సేన రాత్రి 7.45 గంటలకు ఢిల్లీలో దిగనుంది. తర్వాత టీమ్ ప్లేయర్లను ప్రధాని మోదీ ప్రత్యక్షంగా సత్కరించనున్నారు. షెడ్యూల్ ప్రకారం సోమవారమే రావాల్సి ఉన్నా.. భారీ తుఫాను కారణంగా బార్బడోస్ ఎయిర్‌పోర్ట్‌ను మూసివేశారు. దీంతో ప్లేయర్లందరూ హోటల్ రూమ్స్‌కే పరిమితమయ్యారు.

సంబంధిత పోస్ట్