ఆలయం బయట నిద్రిస్తున్న దంపతులను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. ఇద్దరు మృతి(వీడియో)

80చూసినవారు
యూపీలోని కాన్పూర్‌లో ఉన్న ఆనందేశ్వర్ ఆలయం బయట నిద్రిస్తున్న దంపతులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వృద్ధ దంపతులు మృతి చెందారు. మృతులు సాజేటి పోలీస్ స్టేషన్ పరిధిలోని బంద్ గ్రామానికి చెందిన నిర్భయ్ చంద్ అలియాస్ సీతారాం (70), అతని భార్య శాంతి దేవి (65)గా పోలీసులు గుర్తించారు. సీతారాం తన భార్య శాంతితో కలిసి ఆనందేశ్వర్ ఆలయ సముదాయంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్