షాపులో కూర్చున్న యువకుడిని కొట్టి దోచుకెళ్లిన దుండగులు (వీడియో)

79చూసినవారు
పంజాబ్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. షాపులో కూర్చున్న యువకుడిని దారుణంగా కొట్టి దోచుకెళ్లారు. ఈ ఘటన ఈనెల 18న జరగ్గా, తాజాగా వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పంజాబ్‌లోని మోగా పట్టణంలో ఈ ఘటన జరిగింది. షాపులోకి చొరబడిన ముగ్గురు యువకులు కర్రలతో షాపులో ఉన్న యువకుడిపై దారుణంగా దాడి చేశారు. అతడు లేవలేని పరిస్థితిలో ఉండగా, క్యాష్ కౌంటర్‌లో ఉన్న నగదును దోచుకెళ్లారు.

సంబంధిత పోస్ట్