మానవ అక్రమ రవాణాలో చిక్కుకున్న భారతీయులను భారత ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి చేర్చింది. ఉద్యోగాల పేరుతో ఆగ్నేయాసియా దేశమైన లావోస్లో 17 మంది భారతీయులు చిక్కుకుపోయారు. వీరందరిని భారత్కి తీసుకువచ్చారు. దీనిపై విదేశాంగమంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. ఇది ‘‘ మోడీ గ్యారెంటీ’’ అని అన్నారు. లావోస్లో భారత రాయబార కార్యాలయాన్ని జైశంకర్ ప్రశంసించారు. లావోస్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.