కర్ణాటక అసెంబ్లీ వద్ద మరోసారి కలకలం

7043చూసినవారు
కర్ణాటక అసెంబ్లీ వద్ద మరోసారి కలకలం
కర్ణాటక అసెంబ్లీ వద్ద మరోసారి కలకలం రేగింది. బడ్జెట్ సమావేశాల వేళ ఇటీవల ఓ వ్యక్తి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన మరువకముందే మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ కత్తితో అసెంబ్లీకి ప్రవేశించేందుకు యత్నించింది. భద్రతా సిబ్బంది ఆమె బ్యాగులో కత్తిని గుర్తించారు. సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్