రైలును పట్టాలు తప్పించేందుకు మరో కుట్ర

77చూసినవారు
రైలును పట్టాలు తప్పించేందుకు మరో కుట్ర
దేశంలో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రపూరిత ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో మరో ఘటన వెలుగు చూసింది. బుధవారం లక్ష్మణ్‌పూర్‌లో రైలు పట్టాలపై దుండగులు పెద్ద సిమెంట్‌ దిమ్మెలను ఉంచారు. ఆ ట్రాక్‌పై వెళ్లిన ఓ గూడ్స్‌ రైలు సిమెంట్‌ దిమ్మెలను ఢీ కొట్టింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్