కోటాలో మరో నీట్‌ విద్యార్థి ఆత్మహత్య

64చూసినవారు
కోటాలో మరో నీట్‌ విద్యార్థి ఆత్మహత్య
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతున్నాయి. హర్యానా రోహ్‌తక్‌కు చెందిన సుమిత్‌ (20) నీట్‌ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. గత ఏడాది కాలంగా కోటాలోని కున్హాడి ల్యాండ్‌మార్క్‌ సిటీలోని ఓ హాస్టల్‌లో ఉంటూ.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ సెంటర్‌లో కోచింగ్‌ తరగతులకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అతను తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్