రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతున్నాయి. హర్యానా రోహ్తక్కు చెందిన సుమిత్ (20) నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. గత ఏడాది కాలంగా కోటాలోని కున్హాడి ల్యాండ్మార్క్ సిటీలోని ఓ హాస్టల్లో ఉంటూ.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ సెంటర్లో కోచింగ్ తరగతులకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అతను తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.