లోక్సభ ఎన్నికల వేళ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇండోర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన అక్షయ్ బామ్ సోమవారం తన నామినేషన్ ఉప సంహరించుకున్నారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ మెండోలా, మంత్రి కైలాష్ విజయవర్గీయలతో కలిసి రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లిన ఆయన నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. ఎన్నికలకు మరో 14 రోజులు ఉండగా నామినేషన్ విత్ డ్రా చేసుకోవడం గమనార్హం.