దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ కేసులో భాగంగా ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లోనే మకాం వేశారు. నిన్నటి నుంచి ఢిల్లీ పోలీసుల బృందం హైదరాబాద్లోనే గాలింపులు చేపట్టింది. మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ మార్ఫింగ్ కేసులో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో ఐదుగురు ఉన్నారు.