ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కేసులో అరెస్టైన నిందితుల ఫారిన్ టూర్స్పై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరు ఎలాంటి వీసాను పొందారు.. ఏ దేశానికీ ఎందుకు వెళ్లారు? అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు వంటి విషయాలపై వివరాలు సేకరించారు. దీంట్లో భాగంగానే ఇటీవల నాంపల్లి కోర్టులో జరిగిన వాదనల్లో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ వాడకంపై శిక్షణ పొందేందుకు ఇజ్రాయిల్ వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేసారని తెలిసింది.