పుణె లో టీనేజర్ కారు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు మృతి చెందిన కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మద్యం ఆనవాళ్లు పరీక్షించేందుకు బ్లడ్టెస్ట్ నిమిత్తం ప్రధాన నిందితుడి తల్లి రక్త నమూనాలు ఉపయోగించినట్లు పోలీసులు వెల్లడించారు. బ్లడ్ టెస్ట్ జరిగినప్పుడు నిందితుడి తల్లి ఆసుపత్రిలో ఉన్నట్లు, వైద్య సిబ్బంది అరెస్టు తర్వాత నుంచి ఆమె పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.