రెట్టింపు పెరిగిన రాజకీయ పార్టీలు

79చూసినవారు
రెట్టింపు పెరిగిన రాజకీయ పార్టీలు
2009 నుంచి 2024 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీల సంఖ్య 104 శాతం పెరిగింది. ఈ మేరకు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. 2009లో మొత్తం 368 రాజకీయ పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొనగా, 2014లో 464కి, 2019లో 677కి, 2024లో 751కి పెరిగాయి. ఇందులో జాతీయ పార్టీలు 1,333 ఉండగా, రాష్ట్రస్థాయి పార్టీలు 532 ఉన్నాయి. నమోదిత గుర్తింపు లేనివి 2,580, స్వతంత్ర అభ్యర్థులు 3,915 మంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్