ప్రజల గుండెల్లోంచి వాటిని తీసేయలేరు: కేటీఆర్

81చూసినవారు
తెలంగాణ ప్రజల గుండెల్లోంచి చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తీసేయలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చార్మినార్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాజముద్రలో చార్మినార్‌ను, కాకతీయ కళాతోరణాన్ని తీసివేయడం రేవంత్‌రెడ్డి మూర్ఖత్వానికి నిదర్శనం. సర్కార్ తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా కాకతీయ కళాతోరణం, చార్మినార్ వద్ద నిరసనలు తెలుపుతున్నాం. ఉన్నవాటిని తొలగించడం మూర్ఖత్వం, లేనటువంటి వాటిని రాజముద్రలో చేర్చితే సంతోషమే’’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్