ఎగ్జామ్‌ సెంటర్‌ వద్ద సొమ్మసిల్లిన తల్లిదండ్రులు (Video)

85చూసినవారు
గురుగ్రామ్‌లోని సెక్టార్- 47లో ఉన్న SD ఆదర్శ్ స్కూల్ ముందు జరిగిన ఒక దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక మహిళ, ఆమె భర్త వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించారు. వారితో పాటు వారి కూతురు కూడా ఉంది. UPSC ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యేందుకు కూతురు వెళ్లిందని, అయితే విద్యార్థిని కొంత ఆలస్యం చేయడంతో ఆమెను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదని చెబుతున్నారు. దీంతో బాలిక తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ సమయంలో విద్యార్థి తల్లి అపస్మారక స్థితికి చేరుకుంది.

సంబంధిత పోస్ట్