TG: నారాయణపేట జిల్లా, జలాల్పూర్ గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. జలాల్పూర్కి చెందిన బుజ్జమ్మ (36)కు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయిన రెండేళ్లకే భర్త వదిలేసి తల్లి దగ్గర ఉంటోంది.ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మొగులప్పతో బుజ్జమ్మ వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో మొగులప్ప భార్య లక్ష్మి నర్సరీలో పనిచేస్తున్న బుజ్జమ్మ దగ్గరకు వెళ్లి రాయితో మోది హత్య చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.