భారత క్రికెటర్ చాహల్, ధనశ్రీ వర్మ విడాకుల పిటిషన్పై ముంబైలోని ఫ్యామిలీ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. వీరికి విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. దీనికోసం ధనశ్రీకి రూ.4.75 కోట్లు భరణం చెల్లించేందుకు చాహల్ ఇప్పటికే అంగీకరించారు. అందులో కొంత మొత్తాన్ని కూడా అందించినట్లు సమాచారం. కాగా, ఈ తీర్పు కోసమే చాహల్ ఐపీఎల్లో ఇంకా చేరకుండా ఉన్నారు.