బీజేపీ నేత, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ కాంగ్రెస్ను ఉద్దేశించి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము పిలిస్తే విపక్ష నేతలంతా తమతో చేరతారని హెచ్చరించారు. ‘కాంగ్రెస్ అభ్యర్థులంతా కాంగ్రెస్లోనే ఉంటారా..? లేదా..? అనేది ప్రశ్నార్థకం. ఎవరూ కూడా ఆ పార్టీలో ఉండాలని అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ బీజేపీతో చేరాలని అనుకుంటున్నారు’ అని అన్నారు. మోదీజీ మరోసారి ప్రధాని అవుతారని, అందులో ఎలాంటి అనుమానం లేదని జోస్యం చెప్పారు.