ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డొనాల్డ్సన్) తన అతిపెద్ద ప్రాజెక్ట్ను ప్రకటించాడు. అతి పెద్ద గేమ్ షోను చిత్రీకరించబోతున్నట్లు ట్వీట్ చేశాడు. ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుందని చెప్పారు. ఈ గేమ్ షోలో వెయ్యి మందికి పైగా గేమర్స్ పోటీ పడతారని, 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 41 కోట్లు) బహుమతి ఉంటుందని తెలిపారు. అందుకు కొంత సమయం పడుతుందని వెల్లడించారు.