జమ్ముకాశ్మీర్లో ఎన్నికల కమిషన్ అసెంబ్లీ ఎన్నికల కసరత్తును అధికారికంగా ప్రారంభించింది. ఇసి కార్యదర్శి జయదేబ్ లాహిరి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జమ్ము మరియు కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత శాసన సభకు సాధారణ ఎన్నికల కోసం ఎన్నికల చిహ్నాల (రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్) ఆర్డర్ 1968లోని పారా 10బి కింద ఉమ్మడి గుర్తును కేటాయించాలన్న దరఖాస్తులను తక్షణమే ఆమోదించాలని కమిషన్ నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.