చేప ప్రసాదానికి రెండు లక్షల కొర్రమీనులు

70చూసినవారు
చేప ప్రసాదానికి రెండు లక్షల కొర్రమీనులు
చేప ప్రసాదం పంపిణీకి 2లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచారు. ఈ ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాలు సహా బిహార్, యూపీ, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. వేలాదిమందితో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. ప్రసాదం కోసం ఆస్తమా బాధితులు పెద్దఎత్తున వస్తున్నారు. క్యూలైన్‌లో ఉన్నవారికి నాలుగు గంటలకుపైగా సమయం పడుతోంది. భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

సంబంధిత పోస్ట్