దారుణం.. మహిళపై 11 మంది గ్యాంగ్ రేప్

353598చూసినవారు
దారుణం.. మహిళపై 11 మంది గ్యాంగ్ రేప్
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బొగ్గు ఫ్యాక్టరీలో పనిచేసేందుకు వచ్చిన గిరిజన దంపతులుపై దుండగులు దాడి చేసి, భర్తను బంధించారు. అనంతరం భార్యపై కొన్ని రోజుల పాటు 11 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితులు వారి నుండి తప్పించుకొని, సొంతూరు రాయ్ గఢ్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రధాన నిందితుడైన ఫ్యాక్టరీ యజమానిని అరెస్టు చేసి, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్