దారుణం.. ఐదుగురు కుటుంబ‌స‌భ్యుల్ని గొంతుకోసి చంపిన మాజీ సైనికుడు

80చూసినవారు
దారుణం.. ఐదుగురు కుటుంబ‌స‌భ్యుల్ని గొంతుకోసి చంపిన మాజీ సైనికుడు
హ‌ర్యానాలోని నారాయ‌ణ్‌ఘ‌ర్‌లో దారుణం జ‌రిగింది. రాతౌర్ గ్రామంలో ఓ మాజీ సైనికుడు.. ఐదుగురు కుటుంబ‌స‌భ్యుల‌ను చంపేశాడు. భూ వివాదం నేప‌థ్యంలో ఆదివారం నిందితుడు భూష‌ణ్‌ ప‌దునైన ఆయుధంతో త‌ల్లి, సోద‌రుడు, వ‌దిన‌, ఇద్ద‌రు చిన్నారుల గొంతు కోసి హ‌త్య చేశాడు. తండ్రి ఓం ప్ర‌కాశ్‌, సోద‌రుడి మ‌రో కూతురిపై కూడా దాడి చేశాడు. మృతుల్లో స‌రోపి(65), హ‌రీశ్‌(35), సోనియా(32), అయిదేళ్ల అమ్మాయి, ఆర్నెల్ల పిల్లోడు ఉన్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్