పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలోని భూపతినగర్ ప్రాంతంలో శనివారం ఉదయం షాకింగ్ ఘటన జరిగింది. జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బృందంపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక NIA అధికారి గాయపడ్డారు. భూపతినగర్లో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో 2022లో జరిగిన పేలుడు కేసును విచారించేందుకు అధికారులు అక్కడకు వెళ్లారు. ఆ సమయంలో అధికారులపై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.