యూపీలోని మీరట్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. రైల్వే రోడ్డులోని షెరావాలి మాత దేవాలయానికి కొందరు భక్తులు వెళ్లారు. ఈ క్రమంలో ఆలయంలో పూజారితో గొడవ పడ్డారు. సహనం కోల్పోయి పూజారిపై ఇద్దరు యువకులు, ఒక మహిళ దాడి చేశారు. పలుమార్లు చెంపదెబ్బలు కొట్టారు. ఆలయంలో ఉన్న ఇతర భక్తులు ఆ పూజారిని కాపాడారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడికి సంబంధించి మొత్తం 11 మందిపై కేసు నమోదు చేశారు.