ప్రపంచంలోనే అత్యంత ఎతైన పోలింగ్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సముద్ర మట్టానికి సుమారు 15,256 అడుగుల ఎత్తులో ఉన్న తాషిగంగ్ గ్రామంలో నేడు తుది దశ పోలింగ్ జరుగుతోంది. భారత్- చైనా వాస్తవాధీన రేఖ సమీపంలో ఉన్న ఈ గ్రామం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా గుర్తింపు పొందింది. మండి నియోజకవర్గం, స్పితి లోయ ప్రాంత ప్రజలు ఇక్కడ ఓటు వేస్తున్నారు.