ఏడో విడత పోలింగ్ ముమ్మరంగా జరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు 49.68 శాతం నమోదైంది. బీహార్లో 8 లోక్సభ స్థానాల పరిధిలో 42.95 శాతం పోలింగ్ నమోదు కాగా, ఛండీఘడ్లో 52.61 శాతం పోలింగ్ నమోదైంది. హిమాచల్ ప్రదేశ్లో నాలుగు లోక్సభ స్థానాల పరిధిలో 58.41 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఝార్ఖండ్లో మూడు లోక్సభ స్థానాల్లో 60.14 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు.