దేశవ్యాప్తంగా ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎక్కువ సంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గుజరాత్లోని సూరత్ నగరం వేసు ప్రాంతంలో శుక్రవారం ఊహించని ఘటన జరిగింది. స్థానికంగా ఓ వివాహానికి తనకు ఆహ్వానం లేకపోయినా చిరాగ్ పటేల్ అనే వ్యక్తి వెళ్లాడు. అక్కడ కొందరితో గొడవ పడ్డాడు. తనను పెళ్లికి పిలవలేదనే ఆగ్రహంతో నీరజ్ పటేల్తో పాటు కొందరిపై దాడి చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.